కల్తీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: వ్యవసాయ శాఖ
కల్తీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: వ్యవసాయ శాఖ
Editor Desk
ఎర్రుపాలెం: రైతులు తొలకరి సాగుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కల్తీ విత్తనాలు, నకిలీ పురుగుమందుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల రైతు సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
నిబంధనలకు విరుద్ధంగా కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు అధికారిక అనుమతులు ఉన్న డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, పంటల కొనుగోలు, మద్దతు ధర, పంటల బీమా అంశాలపై సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. కల్తీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి