Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:50 AM

కల్తీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: వ్యవసాయ శాఖ

కల్తీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: వ్యవసాయ శాఖ

కల్తీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: వ్యవసాయ శాఖ
04-06-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎర్రుపాలెం: రైతులు తొలకరి సాగుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కల్తీ విత్తనాలు, నకిలీ పురుగుమందుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల రైతు సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

నిబంధనలకు విరుద్ధంగా కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు అధికారిక అనుమతులు ఉన్న డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, పంటల కొనుగోలు, మద్దతు ధర, పంటల బీమా అంశాలపై సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. కల్తీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

Sthanikam

కల్తీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: వ్యవసాయ శాఖ

Article Image

ఎర్రుపాలెం: రైతులు తొలకరి సాగుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కల్తీ విత్తనాలు, నకిలీ పురుగుమందుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల రైతు సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

నిబంధనలకు విరుద్ధంగా కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు అధికారిక అనుమతులు ఉన్న డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, పంటల కొనుగోలు, మద్దతు ధర, పంటల బీమా అంశాలపై సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. కల్తీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News