Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంచేపల్లి మార్గంలో విషాదం.. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక రైతు బలి! కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 06:14 PM

కల్తీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: వ్యవసాయ శాఖ

కల్తీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: వ్యవసాయ శాఖ

కల్తీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: వ్యవసాయ శాఖ
June 04, 2026 04:27 PM 4 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎర్రుపాలెం: రైతులు తొలకరి సాగుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కల్తీ విత్తనాలు, నకిలీ పురుగుమందుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల రైతు సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

నిబంధనలకు విరుద్ధంగా కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు అధికారిక అనుమతులు ఉన్న డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, పంటల కొనుగోలు, మద్దతు ధర, పంటల బీమా అంశాలపై సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. కల్తీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News