Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 09:54 PM

పవన్ వ్యాఖ్యలపై ఉద్యమకారుల ఆగ్రహం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు తగవన్న జోగు అంజన్న

పవన్ వ్యాఖ్యలపై ఉద్యమకారుల ఆగ్రహం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు తగవన్న జోగు అంజన్న

పవన్ వ్యాఖ్యలపై ఉద్యమకారుల ఆగ్రహం.  తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు తగవన్న జోగు అంజన్న
June 04, 2026 08:08 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్

తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణలో సినీ నటుడు చిరంజీవి కుటుంబానికి ఇప్పటికీ గౌరవం ఉందని, అయితే రాజకీయ నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు అందరికీ ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమ చరిత్రపై విమర్శలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు.

తెలంగాణ సాధన కోసం వేలాది మంది ఉద్యమకారులు పోరాడారని, అమరుల త్యాగాలను ఎవరూ విస్మరించరాదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో ముందుకు సాగుతున్న తరుణంలో రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించరాదని సూచించారు.

తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వంపై ఎవరైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఉద్యమకారులు తగిన విధంగా స్పందిస్తారని జోగు అంజన్న స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News