చౌటుప్పల్లో ‘ప్రజా పాలన’ వార్డు సభలు
చౌటుప్పల్లో ‘ప్రజా పాలన’ వార్డు సభలు
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 12, 13వ వార్డుల్లో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ (99 రోజుల కార్యాచరణ) సభలు గురువారం విజయవంతంగా జరిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, వార్డుల వారీగా స్థానిక సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాలు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగిన ఈ సభల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, సీఐ మన్మధ కుమార్, డాక్టర్ కాటమరాజు తదితర అధికారులు పాల్గొని ఇందిరమ్మ ఇండ్లు, శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు కోసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, బత్తుల వాణి విప్లవ్ కుమార్, పాక చిరంజీవి నేతృత్వంలో జరిగిన ఈ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి