Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 08:42 PM

చౌటుప్పల్‌లో ‘ప్రజా పాలన’ వార్డు సభలు

చౌటుప్పల్‌లో ‘ప్రజా పాలన’ వార్డు సభలు

చౌటుప్పల్‌లో ‘ప్రజా పాలన’ వార్డు సభలు
June 04, 2026 07:13 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 12, 13వ వార్డుల్లో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ (99 రోజుల కార్యాచరణ) సభలు గురువారం విజయవంతంగా జరిగాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, వార్డుల వారీగా స్థానిక సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాలు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగిన ఈ సభల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, సీఐ మన్మధ కుమార్, డాక్టర్ కాటమరాజు తదితర అధికారులు పాల్గొని ఇందిరమ్మ ఇండ్లు, శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు కోసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, బత్తుల వాణి విప్లవ్ కుమార్, పాక చిరంజీవి నేతృత్వంలో జరిగిన ఈ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News