Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:51 AM

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు.   ప్రభుత్వ విప్ వేముల వీరేశం
04-06-2026 177 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

రైతులు విక్రయించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశించారు. రామన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు అవసరమైన తాగునీరు, నీడ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తలెత్తుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు.

రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని, వారి ధాన్యానికి సకాలంలో కొనుగోలు, చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని వేముల వీరేశం స్పష్టం చేశారు.ఈ సమావేశంలో భువనగిరి రెవిన్యూ జాయింట్ కలెక్టర్ వెంక రెడ్డి , ఆర్డీవో శేఖర్ రెడ్డి, తాసిల్దార్ లాల్ బహుదూర్, ఎస్ ఐ డి నాగరాజు, ఎంపీడీవో రాములు,సంబంధిత శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం

Article Image

రామన్నపేట

రైతులు విక్రయించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశించారు. రామన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు అవసరమైన తాగునీరు, నీడ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తలెత్తుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు.

రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని, వారి ధాన్యానికి సకాలంలో కొనుగోలు, చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని వేముల వీరేశం స్పష్టం చేశారు.ఈ సమావేశంలో భువనగిరి రెవిన్యూ జాయింట్ కలెక్టర్ వెంక రెడ్డి , ఆర్డీవో శేఖర్ రెడ్డి, తాసిల్దార్ లాల్ బహుదూర్, ఎస్ ఐ డి నాగరాజు, ఎంపీడీవో రాములు,సంబంధిత శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News