Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 10:00 PM

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు.   ప్రభుత్వ విప్ వేముల వీరేశం
June 04, 2026 06:41 PM 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

రైతులు విక్రయించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశించారు. రామన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు అవసరమైన తాగునీరు, నీడ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తలెత్తుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు.

రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని, వారి ధాన్యానికి సకాలంలో కొనుగోలు, చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని వేముల వీరేశం స్పష్టం చేశారు.ఈ సమావేశంలో భువనగిరి రెవిన్యూ జాయింట్ కలెక్టర్ వెంక రెడ్డి , ఆర్డీవో శేఖర్ రెడ్డి, తాసిల్దార్ లాల్ బహుదూర్, ఎస్ ఐ డి నాగరాజు, ఎంపీడీవో రాములు,సంబంధిత శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News