ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం
Editor Desk
రామన్నపేట
రైతులు విక్రయించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశించారు. రామన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు అవసరమైన తాగునీరు, నీడ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తలెత్తుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు.
రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని, వారి ధాన్యానికి సకాలంలో కొనుగోలు, చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని వేముల వీరేశం స్పష్టం చేశారు.ఈ సమావేశంలో భువనగిరి రెవిన్యూ జాయింట్ కలెక్టర్ వెంక రెడ్డి , ఆర్డీవో శేఖర్ రెడ్డి, తాసిల్దార్ లాల్ బహుదూర్, ఎస్ ఐ డి నాగరాజు, ఎంపీడీవో రాములు,సంబంధిత శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి