Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 09:54 PM

తాజ్‌పూర్‌లో గ్రామసభ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ

తాజ్‌పూర్‌లో గ్రామసభ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ

తాజ్‌పూర్‌లో గ్రామసభ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ
June 04, 2026 07:42 PM 7 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తాజ్‌పూర్ గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, ఎంఈవో, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గత ఐదు నెలల కాలంలో గ్రామాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా స్వంత నిధులతో ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త డబ్బాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. చెత్త నిర్వహణలో ఆదర్శంగా నిలిచిన ఇద్దరు మహిళలను సభలో సన్మానించారు.

యువత మద్యం, మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా సంప్రదించవచ్చని, 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.

కార్యక్రమంలో సామాజికవేత్త డా. ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News