తాజ్పూర్లో గ్రామసభ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ
తాజ్పూర్లో గ్రామసభ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ
Editor Desk
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తాజ్పూర్ గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, ఎంఈవో, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గత ఐదు నెలల కాలంలో గ్రామాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా స్వంత నిధులతో ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త డబ్బాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. చెత్త నిర్వహణలో ఆదర్శంగా నిలిచిన ఇద్దరు మహిళలను సభలో సన్మానించారు.
యువత మద్యం, మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా సంప్రదించవచ్చని, 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
కార్యక్రమంలో సామాజికవేత్త డా. ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి