Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 08:44 PM

వార్డు ప్రజల తాగునీటి కష్టాలకు చెక్!

వార్డు ప్రజల తాగునీటి కష్టాలకు చెక్!

వార్డు ప్రజల తాగునీటి కష్టాలకు చెక్!
June 04, 2026 07:14 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* రూ. లక్షలతో ఆర్‌ఓ ప్లాంట్ మరమ్మతు పనులు ప్రారంభం

​* త్వరలోనే శుద్ధజలం అందిస్తాం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్

రాంనగర్ కాలనీ వార్డు ప్రజల తాగునీటి కష్టాలను తీర్చి, త్వరలోనే ఆర్‌ఓ ఫిల్టర్ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తెస్తామని 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం పరిధిలోని 13వ వార్డు రాంనగర్ కాలనీలో గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్‌ఓ వాటర్ ఫిల్టర్ మరమ్మతు పనులను గురువారం ఆమె అధికారికంగా ప్రారంభించారు.​దివీస్ లాబొరేటరీస్ పరిశ్రమ యాజమాన్యం, చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ల ప్రత్యేక సహకారంతో ఈ పునరుద్ధరణ పనులను చేపట్టారు.​ఈ సందర్భంగా కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్‌ఓ ఫిల్టర్ పాడైపోయి ఉండటంతో కాలనీవాసులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. గతంలో దివీస్ పరిశ్రమ సహకారంతోనే ఈ వాటర్ ఫిల్టర్ నిర్మించినందున, మరమ్మతుల విషయాన్ని కూడా సదరు పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన యాజమాన్యం వెంటనే బోరు, ఫిల్టర్ మరమ్మతు పనులను మంజూరు చేసిందని చెప్పారు.​మరమ్మతుల్లో భాగంగా మొదట బోరు బావిని బాగు చేయించాం. భూగర్భంలో సమృద్ధిగా నీరు ఉండటం సంతోషకరం. యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయించి, త్వరలోనే వార్డు ప్రజలందరికీ మంచినీటిని సరఫరా చేస్తాం.పనుల పరిశీలన ​మరమ్మతు పనుల ప్రారంభం అనంతరం కౌన్సిలర్, స్థానిక నాయకులు పనుల నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దివీస్ ప్రతినిధి వెంకటేశ్వర్లు, వర్కాల కుమార్ గౌడ్, చెవగోని వెంకటేష్ గౌడ్, మార్గం నర్సింహ్మ యాదవ్, చెరుకు అశోక్ గౌడ్, గుయ్యని జంగయ్య, చెరుకు సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News