సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి
Editor Desk
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి పై దేవరకొండ మండలం కొర్ర తండాకు చెందిన జనసేన కార్యకర్త కొర్ర చందు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో రామన్నపేట సబ్ ఇన్స్పెక్టర్కు వినతిపత్రం అందజేసి, కొర్ర చందుపై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా బట్టె సంతోష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండనీయమన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజా నాయకులపై మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలను యువజన కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పున్న అమరేందర్, మండల ఉపాధ్యక్షులు కేస సాయి, జవ్వాజి శ్రీకాంత్, రుద్రాల విక్కీ సాయి, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి