Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:53 AM

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి
05-06-2026 165 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి పై దేవరకొండ మండలం కొర్ర తండాకు చెందిన జనసేన కార్యకర్త కొర్ర చందు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో రామన్నపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, కొర్ర చందుపై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా బట్టె సంతోష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండనీయమన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజా నాయకులపై మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలను యువజన కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పున్న అమరేందర్, మండల ఉపాధ్యక్షులు కేస సాయి, జవ్వాజి శ్రీకాంత్, రుద్రాల విక్కీ సాయి, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

Article Image

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి పై దేవరకొండ మండలం కొర్ర తండాకు చెందిన జనసేన కార్యకర్త కొర్ర చందు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో రామన్నపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, కొర్ర చందుపై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా బట్టె సంతోష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండనీయమన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజా నాయకులపై మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలను యువజన కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పున్న అమరేందర్, మండల ఉపాధ్యక్షులు కేస సాయి, జవ్వాజి శ్రీకాంత్, రుద్రాల విక్కీ సాయి, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News