Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దివిస్ లేబరేటరీస్ లో పర్యావరణ దినోత్సవం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 05, 2026 08:01 PM

భవిష్యత్‌ కోసం ఒక మొక్క నాటాలి

భవిష్యత్‌ కోసం ఒక మొక్క నాటాలి

భవిష్యత్‌ కోసం ఒక మొక్క నాటాలి
June 05, 2026 05:42 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ ఆదోని అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం టీడీపీ నాయకుడు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని కోరారు.


మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News