Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:48 AM

భవిష్యత్‌ కోసం ఒక మొక్క నాటాలి

భవిష్యత్‌ కోసం ఒక మొక్క నాటాలి

భవిష్యత్‌ కోసం ఒక మొక్క నాటాలి
05-06-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ ఆదోని అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం టీడీపీ నాయకుడు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని కోరారు.


మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

Sthanikam

భవిష్యత్‌ కోసం ఒక మొక్క నాటాలి

Article Image

ఆదోని, : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ ఆదోని అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం టీడీపీ నాయకుడు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని కోరారు.


మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News