భవిష్యత్ కోసం ఒక మొక్క నాటాలి
భవిష్యత్ కోసం ఒక మొక్క నాటాలి
Editor Desk
ఆదోని, : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ ఆదోని అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం టీడీపీ నాయకుడు శ్రీకాంత్రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని కోరారు.
మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేయడం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి