Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 05, 2026 09:08 PM

మాదిగలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలి

మాదిగలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలి

మాదిగలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలి
June 05, 2026 07:01 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. గోవిందు నరేష్ మాదిగ

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్‌కు సత్కారం

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు విద్యా, ఆర్థిక రంగాలతో పాటు రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదగాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. గోవిందు నరేష్ మాదిగ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి ఎన్నికైన బోయ దేవేందర్‌ను చౌటుప్పల్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు.​ఈ సందర్భంగా డా. నరేష్ మాదిగ మాట్లాడుతూ.. 'పద్మశ్రీ' మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాల పోరాటాల వల్లే మాదిగలకు రాజకీయ గుర్తింపు లభించిందన్నారు. బోయ దేవేందర్ తన క్రమశిక్షణ, సేవాతత్పరతతోనే రెండోసారి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారని, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జాతి ఉన్నతికి తోడ్పడాలని ఆకాంక్షించారు.

ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు ఊదరి వెంకటేష్ మహాజన్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బోడ్డు శ్రవణ్ కుమార్, కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాము, మాదిగ జర్నలిస్టు ఫోరం మండల అధ్యక్షులు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మండల సహాయ కార్యదర్శి బొడ్డు గణేష్, ఎమ్మార్పీఎస్ కోయలగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు ఊదరి భాస్కర్, బోదుల స్వామి, చెక్క లింగస్వామి, బీసీ సంఘం నాయకులు వీరమల్ల సత్తయ్య, బుడగ జంగాల నాయకులు ప్రభు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News