మాదిగలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలి
మాదిగలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలి
K.RAVI
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. గోవిందు నరేష్ మాదిగ
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్కు సత్కారం
తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు విద్యా, ఆర్థిక రంగాలతో పాటు రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదగాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. గోవిందు నరేష్ మాదిగ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి ఎన్నికైన బోయ దేవేందర్ను చౌటుప్పల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా డా. నరేష్ మాదిగ మాట్లాడుతూ.. 'పద్మశ్రీ' మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాల పోరాటాల వల్లే మాదిగలకు రాజకీయ గుర్తింపు లభించిందన్నారు. బోయ దేవేందర్ తన క్రమశిక్షణ, సేవాతత్పరతతోనే రెండోసారి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారని, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జాతి ఉన్నతికి తోడ్పడాలని ఆకాంక్షించారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు ఊదరి వెంకటేష్ మహాజన్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బోడ్డు శ్రవణ్ కుమార్, కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాము, మాదిగ జర్నలిస్టు ఫోరం మండల అధ్యక్షులు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మండల సహాయ కార్యదర్శి బొడ్డు గణేష్, ఎమ్మార్పీఎస్ కోయలగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు ఊదరి భాస్కర్, బోదుల స్వామి, చెక్క లింగస్వామి, బీసీ సంఘం నాయకులు వీరమల్ల సత్తయ్య, బుడగ జంగాల నాయకులు ప్రభు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి