పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి
Editor Desk
నల్గొండ, : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డీవైఎఫ్ఐ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 48వ వార్డులోని పార్కులో శుక్రవారం మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో యువత ముందుండి పనిచేయాలని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా చేపట్టాలని పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా భావితరాలకు మెరుగైన భవిష్యత్తు అందించవచ్చని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు కట్ట ప్రభాత్, జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, పట్టణ నాయకులు గద్దపాటి రఘువరన్, బూర్గు గోపికృష్ణ, బోగరి సుకుమార్, కార్తీక్, మాదాసు రావణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి