Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 05, 2026 09:09 PM

మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకుందాం:ఖేఢ్ జడ్జి హిమబిందు

మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకుందాం:ఖేఢ్ జడ్జి హిమబిందు

మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకుందాం:ఖేఢ్ జడ్జి హిమబిందు
June 05, 2026 07:01 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం. హిమబిందు మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. వర్షాకాలం మొక్కలు నాటడానికి అత్యంత అనుకూలమైన సమయమని పేర్కొంటూ, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు మనకు స్వచ్ఛమైన గాలిని అందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకాన్ని అందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని జడ్జి ఎం. హిమబిందు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News