మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకుందాం:ఖేఢ్ జడ్జి హిమబిందు
మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకుందాం:ఖేఢ్ జడ్జి హిమబిందు
Krishna
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం. హిమబిందు మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. వర్షాకాలం మొక్కలు నాటడానికి అత్యంత అనుకూలమైన సమయమని పేర్కొంటూ, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు మనకు స్వచ్ఛమైన గాలిని అందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకాన్ని అందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని జడ్జి ఎం. హిమబిందు కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి