Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:53 PM

మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకుందాం:ఖేఢ్ జడ్జి హిమబిందు

మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకుందాం:ఖేఢ్ జడ్జి హిమబిందు

మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకుందాం:ఖేఢ్ జడ్జి హిమబిందు
05-06-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం. హిమబిందు మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. వర్షాకాలం మొక్కలు నాటడానికి అత్యంత అనుకూలమైన సమయమని పేర్కొంటూ, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు మనకు స్వచ్ఛమైన గాలిని అందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకాన్ని అందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని జడ్జి ఎం. హిమబిందు కోరారు.

Sthanikam

మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకుందాం:ఖేఢ్ జడ్జి హిమబిందు

Article Image

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం. హిమబిందు మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. వర్షాకాలం మొక్కలు నాటడానికి అత్యంత అనుకూలమైన సమయమని పేర్కొంటూ, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు మనకు స్వచ్ఛమైన గాలిని అందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకాన్ని అందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని జడ్జి ఎం. హిమబిందు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News