దళితులకు న్యాయం చేయాలని వినతి పత్రం
దళితులకు న్యాయం చేయాలని వినతి పత్రం
Anjali
శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యలయం లో ఎస్సీ,ఎస్టీ కమిటీ చైర్మన్ కే ఎస్ జవహర్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై ప్రత్యేక గ్రీవేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా జై భీమ్రావు భారత పార్టీ సమక్షంలో శ్రీ సత్య జిల్లాలోని మాన స్మశాన వాటికల విషయమై అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అలాగే లేపాక్షి మండలం కల్లూరు గ్రామ పరిధిలోని హైవేలో భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని,ఈ విషయమై ఎమ్మార్వో దృష్టికి కలెక్టర్ దృష్టికి అనేకమార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిన ఇంతవరకు పరిహారం అందలేదని, జిల్లాలోని దళితుల భూములు అగ్రవర్ణాలు ఆక్రమించుకొని అక్రమ రిజిస్టులు చేసుకుని చాలామంది దళితులు సహనం కోల్పోతున్నారని,జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లూరు నాగరాజు కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం దళితులకు న్యాయం జరగాలని కోరారు.ఈ కార్యక్రమం లో జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లూరు jG నాగరాజు, జిల్లా మీడియా అధికార ప్రతినిధి మద్దెల
ఈశ్వర్,ధర్మవరం డివిజన్ ఇంచార్జ్ సీతారాంపల్లి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి