Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల భద్రతే లక్ష్యం.. ఎన్‌హెచ్-65 పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 05, 2026 06:42 PM

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.......

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.......

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి  పౌరుడిపై ఉంది.......
June 05, 2026 05:33 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోదాడ కోర్టు ఆవరణలో శుక్రవారం మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కోదాడ సబ్ జడ్జి కే. సురేష్ న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి కోర్టు ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటి నీళ్లు పోశారు.ఈ సందర్భంగా సబ్ జడ్జి కే. సురేష్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు మనం స్వచ్ఛమైన గాలిని, కలుషితం కాని నీటిని అందించాలంటే నేటి నుంచే పెద్దఎత్తున వృక్షాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, అవి పెరిగే వరకు బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కే. భవ్య, ఫస్ట్ ఏడీఎం జడ్జి మహమ్మద్ ఉమర్ , సెకండ్ ఏడీఎం జడ్జి జాకియా సుల్తానాలతో పాటు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, కెవి రావు, హేమలత, పెద్దబ్బాయి, తాటి మురళి, ఉయ్యాల నరసయ్య, శరత్ కుమార్, నవీన్ కుమార్, రవీందర్, పారా లీగల్ వాలంటీర్ లు,కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News