యాదాద్రి భువనగిరి,
జూన్ 2న రెండు లక్షల మందికి కొత్త చేయూత పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదని ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెన్షన్ల పంపిణీకి వెంటనే తేదీ ప్రకటించాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లపెల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి