ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో మొక్కలు నాటిన; లైన్స్ క్లబ్ సభ్యులు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో మొక్కలు నాటిన; లైన్స్ క్లబ్ సభ్యులు
Bandi Kiran Kumar
తుంగతుర్తి పట్టణంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంకులో హరితహారం మొక్కలను నాటి లైన్స్ క్లబ్ సభ్యులు పర్యావరణ పరిరక్షణ హరితహారం లక్ష్యంతో ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం పచ్చని చెట్లతో ఆలాధకరమైన గాలిని పీల్చడం మంచిదని మన పూర్వీకుల అనుభవాలతో మన మండలంలో ప్రతినెల పచ్చని చెట్లను నాటడం పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ప్రపంచ పర్యావరణాన్ని కాపాడటమే మన క్లబ్ ధ్యేయంగా నిర్మాణం చేసుకోవడం జరిగిందన్నారు. శుక్రవారం తుంగతుర్తి పట్టణంలోని లైన్స్ క్లబ్ జిల్లా ప్రతినిధి పాలవరపు సంతోష్ మాట్లాడుతూ.... ప్రతి నెల కొన్ని ప్రోగ్రాములు లైన్స్ క్లబ్ వారిచే చేయిస్తూ మేము సైతం అంటూ ప్రతి పేదవారిని ఆదుకోవడం మా చేతనైన సహాయం చేయడం పచ్చని మొక్కలను నాటడం చేస్తున్న ప్రోగ్రాములు లైన్స్ క్లబ్ సూర్యాపేట జిల్లా వారిచే మేము తుంగతుర్తి పట్టణంలో ఎన్నో లైన్స్ క్లబ్ ప్రోగ్రాములు పేదవారికి ఉచిత ఆరోగ్య శిబిరాలు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపిస్తూ లైన్స్ క్లబ్ సేవలను అందిస్తున్నామన్నారు. ఈరోజు పట్టణంలోని ఇండియన్ ఆయిల్ బంకులో మొక్కలను నాటడం వాటిని సంరక్షణ చేయడం మా బాధ్యత అన్నారు. అదేవిధంగా మా సహకారంతో గ్రామంలోని మెయిన్ రోడ్డుపై పచ్చని మొక్కలను నాటి వాడిని సంరక్షణ చేస్తూ మా సేవలు అందివ్వడానికి అహర్నిశలు కృషి చేస్తున్న లైన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియపరిచారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి మన వంతు సహకారం అందించాలని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు తల్లాడ కేదారి గుండ గాని రాము ఎనగందుల గిరి శ్రీనివాస్ ఓరుగంటి సుభాష్ శ్రీనివాస్ గుజ్జ భాస్కర్ లక్ష్మణరావు గిరి చారి డాక్టర్ పప్పుల వెంకన్న పలువురు లైన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి