Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 05, 2026 09:58 PM

శుభదినాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

శుభదినాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

శుభదినాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
June 05, 2026 08:46 PM 4 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, అధిక జ్యేష్ఠ మాసంలో శనివారం షష్టి తిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, తులసీ అర్చన, పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పుణ్యదినాన గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భువనగిరి గ్రామానికి చెందిన మహేశుని నరేష్ కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరిస్తున్నారు. నరేష్ తన 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి అన్నదాన సేవ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.


ఈ సందర్భంగా మహేశుని నరేష్, వేదవతి, కార్తీక్‌, సాత్విక, తులసమ్మలకు స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని భక్తులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News