శుభదినాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
శుభదినాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
Editor Desk
భువనగిరి, అధిక జ్యేష్ఠ మాసంలో శనివారం షష్టి తిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, తులసీ అర్చన, పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పుణ్యదినాన గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భువనగిరి గ్రామానికి చెందిన మహేశుని నరేష్ కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరిస్తున్నారు. నరేష్ తన 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి అన్నదాన సేవ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మహేశుని నరేష్, వేదవతి, కార్తీక్, సాత్విక, తులసమ్మలకు స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని భక్తులు ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి