PRINT TIME: June 05, 2026 09:13 PM
దివిస్ లేబరేటరీస్ లో పర్యావరణ దినోత్సవం
దివిస్ లేబరేటరీస్ లో పర్యావరణ దినోత్సవం
June 05, 2026 07:13 PM
38 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
'ఏక్ పేడ్ మా కే నామ్' కింద భారీగా మొక్కల నాటడం
ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకోవాలని దివిస్ పరిశ్రమ ఉపాధ్యక్షులు ఎస్. రామకృష్ణ, జి. హేమంత్ కుమార్ పిలుపునిచ్చారు. 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం దివిస్ లేబరేటరీస్ ఆవరణలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించి, ‘పది ఎకో లైఫ్ స్టైల్స్’ అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు.కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సూచనల మేరకు 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ ఆవరణలో భారీగా మొక్కలు నాటారు. ఏజీఎం డి.వి. రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు రూపొందించిన పర్యావరణ నమూనాల ప్రదర్శన స్టాల్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జీఎంలు జి. బాలకిషోర్, పి. సుధాకర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి