Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 07:27 PM

టేకుమట్ల జాతరలో భేరి మోగించిన సర్వోత్తమ్ రెడ్డి

టేకుమట్ల జాతరలో భేరి మోగించిన సర్వోత్తమ్ రెడ్డి

టేకుమట్ల జాతరలో భేరి మోగించిన సర్వోత్తమ్ రెడ్డి
June 15, 2026 05:36 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

లింగమంతుల స్వామి జాతరలో సందడి చేసిన కాంగ్రెస్ నేతలు

సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ శివారులో యాదవుల ఆరాధ్య దైవాలైన శ్రీశ్రీశ్రీ లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ జాతర ఉత్సవాలకు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముదిరెడ్డి రమణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎడ్ల గంగభవాని వీరమల్లు యాదవ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం జాతరకు విచ్చేసిన భక్తులతో కలిసి భేరి వాయిస్తూ ఉత్సాహభరిత వాతావరణంలో యాదవ సోదరులతో సందడి చేశారు.

ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. జాతర గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు బొర్రాజు జానయ్య, జాల జనాకిరాములు, లోడంగి సోమయ్య, జాల మాణిక్యం, బొర్రాజు వెంకన్న, జాల నర్సయ్య, 11వ వార్డు కాంగ్రెస్ నాయకులు నంద్యాల మహేష్ రెడ్డి, కొప్పుల విష్ణువర్ధన్ రెడ్డి, జంగిలి లింగయ్య, కొప్పుల వెంకట్ రెడ్డి, గోపిరెడ్డి ఉపేందర్ రెడ్డి, ఎడ్ల రమేష్, జంగిలి నాగరాజు, ఎల్లంల నాగరాజు, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, గుణగంటి హేమ సతీష్, వల్దాసు లక్ష్మీ శ్రీనివాస్ (రెబల్), శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ ఏలిమినేటి అభినయ్ నాయుడు, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్య సుధీర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ పిడమర్తి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పడిదల రవి, అయ్యన్న, శాంతయ్య, నాయకులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News