Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 07:33 PM

తిరుమలగిరి(జి) జాతరలో కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు

తిరుమలగిరి(జి) జాతరలో కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు

తిరుమలగిరి(జి) జాతరలో కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు
June 15, 2026 05:36 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గురప్ప స్వామి, గంగమ్మ తల్లి జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలోని తిరుమలగిరి(జి) గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ గురప్ప స్వామి, గంగమ్మ తల్లి, పోతురాజు జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని గ్రామ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. జాతర గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పిందని, సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడే ఇలాంటి ఉత్సవాలు సమాజ ఐక్యతకు దోహదపడతాయని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, తిరుమలగిరి(జి) గ్రామ సర్పంచ్ కొదమగుండ్ల నగేష్, ఉప సర్పంచ్ పిట్ట వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చన్నోజు నరసింహాచారి, షేక్ అబ్దుల్ కరీం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుబ్బాక ప్రభాకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కంచర్ల సుధాకర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు మంచికంటి గోపిరెడ్డి, బోలక వెంకటేశ్వర్లు, పబ్బు నాగరాజు, బోలక సైదులు, రామ్ రెడ్డి, నకరికంటి సైదులు, కంచర్ల నరేందర్ రెడ్డి, బోగిళ్ల అఖిల్, అరవింద్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ఏలుగురి ఇందిరా వీరయ్యగౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాపర్తి నాగరాజు, వెన్న ఉపేందర్, పట్టణ కాంగ్రెస్ నాయకులు షేక్ రహీం, కోడి కిరణ్, మైనార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులు షేక్ సోహెల్, షేక్ గౌస్ పాషా, నూకల మనోజ్, రాచకొండ శివమణి, రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


జాతర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News