Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:06 AM

ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు.. *పరిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ

ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు.. *పరిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ

ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు..  *పరిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ
04-07-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కృష్ణా,

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలను కృష్ణాజిల్లాలోని కానూరులో రాధా–రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోయిన ఏడుకొండలు నాయకత్వం వహించారు. జయంతి సందర్భంగా పరిశుద్ధ కార్మికులను సన్మానించి వారికి చీరలను పంపిణీ చేశారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా పేదల ఆశాజ్యోతి అని కొనియాడారు. కుల, మతాలకు అతీతంగా ఆయనకు విశేష అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మరణించి 38 సంవత్సరాలు గడిచినా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడిగా నిలిచారని తెలిపారు. నేటి యువత వంగవీటి మోహనరంగాను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతన సత్యనారాయణ, తుమ్మల నాంచారయ్య, పుప్పాల రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు.. *పరిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ

Article Image

కృష్ణా,

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలను కృష్ణాజిల్లాలోని కానూరులో రాధా–రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోయిన ఏడుకొండలు నాయకత్వం వహించారు. జయంతి సందర్భంగా పరిశుద్ధ కార్మికులను సన్మానించి వారికి చీరలను పంపిణీ చేశారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా పేదల ఆశాజ్యోతి అని కొనియాడారు. కుల, మతాలకు అతీతంగా ఆయనకు విశేష అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మరణించి 38 సంవత్సరాలు గడిచినా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడిగా నిలిచారని తెలిపారు. నేటి యువత వంగవీటి మోహనరంగాను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతన సత్యనారాయణ, తుమ్మల నాంచారయ్య, పుప్పాల రంగారావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News