కృష్ణా,
మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలను కృష్ణాజిల్లాలోని కానూరులో రాధా–రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోయిన ఏడుకొండలు నాయకత్వం వహించారు. జయంతి సందర్భంగా పరిశుద్ధ కార్మికులను సన్మానించి వారికి చీరలను పంపిణీ చేశారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా పేదల ఆశాజ్యోతి అని కొనియాడారు. కుల, మతాలకు అతీతంగా ఆయనకు విశేష అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మరణించి 38 సంవత్సరాలు గడిచినా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడిగా నిలిచారని తెలిపారు. నేటి యువత వంగవీటి మోహనరంగాను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతన సత్యనారాయణ, తుమ్మల నాంచారయ్య, పుప్పాల రంగారావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి