Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతులకు ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 05, 2026 12:24 AM

ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు.. *పరిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ

ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు.. *పరిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ

ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు..  *పరిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ
July 04, 2026 10:32 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కృష్ణా,

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలను కృష్ణాజిల్లాలోని కానూరులో రాధా–రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోయిన ఏడుకొండలు నాయకత్వం వహించారు. జయంతి సందర్భంగా పరిశుద్ధ కార్మికులను సన్మానించి వారికి చీరలను పంపిణీ చేశారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా పేదల ఆశాజ్యోతి అని కొనియాడారు. కుల, మతాలకు అతీతంగా ఆయనకు విశేష అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మరణించి 38 సంవత్సరాలు గడిచినా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడిగా నిలిచారని తెలిపారు. నేటి యువత వంగవీటి మోహనరంగాను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతన సత్యనారాయణ, తుమ్మల నాంచారయ్య, పుప్పాల రంగారావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News