ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు వెంటనే విడుదల చేయాలి: మర్రి రమేష్
ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు వెంటనే విడుదల చేయాలి: మర్రి రమేష్
Komidala Mahender reddy
చిట్యాల: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు గత మూడు నెలలుగా గౌరవ వేతనాలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ మాజీ అధ్యక్షుడు మర్రి రమేష్ అన్నారు.ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. కూలీలకు పనులు కల్పించడం, మస్టర్ నమోదు, పని ప్రదేశాల పర్యవేక్షణతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, మరుగుదొడ్లు, హరితహారం వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ మూడు నెలలుగా వేతనాలు అందక కుటుంబాల పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.పెండింగ్లో ఉన్న మూడు నెలల గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేసి ఉపాధి హామీ సిబ్బందిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మర్రి రమేష్ డిమాండ్ చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి