ప్రజల ఫిర్యాదులకు త్వరిత పరిష్కారమే లక్ష్యం: అదనపు ఎస్పీ
ప్రజల ఫిర్యాదులకు త్వరిత పరిష్కారమే లక్ష్యం: అదనపు ఎస్పీ
Krishna
సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించి, పారదర్శకంగా, వేగంగా న్యాయం అందించడమే సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి