Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీరామ నామస్మరణతో కలశ వందనం.. కనకదుర్గ ఆలయంలో భక్తులకు పిలుపు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 08:17 PM

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమాల విజయమే: డివైఎఫ్ఐ.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమాల విజయమే: డివైఎఫ్ఐ.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమాల విజయమే: డివైఎఫ్ఐ.
July 28, 2026 04:56 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తిపర్తి, జూలై 28

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన ఉద్యమాల విజయమని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ అన్నారు. మంగళవారం తిపర్తిలో నిర్వహించిన డివైఎఫ్ఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

నీట్‌తో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో జరిగిన పేపర్ లీక్‌లు, అవకతవకలతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం విద్యార్థుల పోరాటానికి లభించిన విజయమని అన్నారు.

దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐతో పాటు ప్రజాస్వామ్య శక్తులు చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే ఈ పరిణామం చోటుచేసుకుందని తెలిపారు. భవిష్యత్తులో పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.

సమావేశంలో డివైఎఫ్ఐ తిపర్తి మండల కార్యదర్శి పోకల శశిధర్, మండల అధ్యక్షుడు లింగరాజు, శంకర్, శివ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News