పీఆర్సీ ప్రకటించాలి.. సీపీఎస్ రద్దు చేయాలి ఆగస్టు 1 రాష్ట్ర మహాధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో రావాలి: తపస్ నేత పూజారి రమేశ్
పీఆర్సీ ప్రకటించాలి.. సీపీఎస్ రద్దు చేయాలి ఆగస్టు 1 రాష్ట్ర మహాధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో రావాలి: తపస్ నేత పూజారి రమేశ్
Editor Desk
మాడుగుల, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించి, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజారి రమేశ్ డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల తపస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు ఆగస్టు 1న నిర్వహించనున్న రాష్ట్ర మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న మహాధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం పెండింగ్ పీఆర్సీని ప్రకటించడంతో పాటు ఆరు డీఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని కోరారు. అలాగే ఎస్ఎస్ఏ ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు, మోడల్ స్కూల్, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, 2010కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జే. కరుణాకర్ రెడ్డి, జిల్లా బాధ్యులు పున్న రమేష్, మండల అధ్యక్షుడు ఆకుల శేఖర్, ప్రధాన కార్యదర్శి కాలే కృష్ణ, సహాధ్యక్షులు చీర వెంకటేష్, శ్రీధర్ గౌడ్, ఎం. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి