Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ అధ్యక్షుడిగా కే. పవన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 10:24 PM

పీఆర్సీ ప్రకటించాలి.. సీపీఎస్ రద్దు చేయాలి ఆగస్టు 1 రాష్ట్ర మహాధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో రావాలి: తపస్ నేత పూజారి రమేశ్

పీఆర్సీ ప్రకటించాలి.. సీపీఎస్ రద్దు చేయాలి ఆగస్టు 1 రాష్ట్ర మహాధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో రావాలి: తపస్ నేత పూజారి రమేశ్

పీఆర్సీ ప్రకటించాలి.. సీపీఎస్ రద్దు చేయాలి ఆగస్టు 1 రాష్ట్ర మహాధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో రావాలి: తపస్ నేత పూజారి రమేశ్
July 28, 2026 08:17 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాడుగుల, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించి, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజారి రమేశ్ డిమాండ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల తపస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు ఆగస్టు 1న నిర్వహించనున్న రాష్ట్ర మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న మహాధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం పెండింగ్ పీఆర్సీని ప్రకటించడంతో పాటు ఆరు డీఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. అలాగే ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు, మోడల్ స్కూల్, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, 2010కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జే. కరుణాకర్ రెడ్డి, జిల్లా బాధ్యులు పున్న రమేష్, మండల అధ్యక్షుడు ఆకుల శేఖర్, ప్రధాన కార్యదర్శి కాలే కృష్ణ, సహాధ్యక్షులు చీర వెంకటేష్, శ్రీధర్ గౌడ్, ఎం. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News