Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ అధ్యక్షుడిగా కే. పవన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 11:13 PM

గుంతలమయమైన రహదారితో ప్రజలకు ఇబ్బందులు.. వెంటనే మరమ్మతులు చేపట్టాలి

గుంతలమయమైన రహదారితో ప్రజలకు ఇబ్బందులు.. వెంటనే మరమ్మతులు చేపట్టాలి

గుంతలమయమైన రహదారితో ప్రజలకు ఇబ్బందులు.. వెంటనే మరమ్మతులు చేపట్టాలి
July 28, 2026 08:57 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కోహిర్–మద్రి ఎక్స్‌రోడ్ రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు జి. శివ సాయి ముదిరాజ్, తరహా పాటిల్ ప్రభుత్వాన్ని కోరారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కొహిర్ మండలం నుంచి మద్రి ఎక్స్‌రోడ్ వరకు ఉన్న రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ రహదారిపై నిత్యం ప్రయాణించే విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. వెంటనే స్పందించి కొహిర్–మద్రి ఎక్స్‌రోడ్‌ను అత్యవసరంగా మరమ్మతు చేసి ప్రజలకు సురక్షితమైన, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News