PRINT TIME: July 28, 2026 11:13 PM
గుంతలమయమైన రహదారితో ప్రజలకు ఇబ్బందులు.. వెంటనే మరమ్మతులు చేపట్టాలి
గుంతలమయమైన రహదారితో ప్రజలకు ఇబ్బందులు.. వెంటనే మరమ్మతులు చేపట్టాలి
July 28, 2026 08:57 PM
43 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
కోహిర్–మద్రి ఎక్స్రోడ్ రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు జి. శివ సాయి ముదిరాజ్, తరహా పాటిల్ ప్రభుత్వాన్ని కోరారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కొహిర్ మండలం నుంచి మద్రి ఎక్స్రోడ్ వరకు ఉన్న రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ రహదారిపై నిత్యం ప్రయాణించే విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. వెంటనే స్పందించి కొహిర్–మద్రి ఎక్స్రోడ్ను అత్యవసరంగా మరమ్మతు చేసి ప్రజలకు సురక్షితమైన, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి