Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ అధ్యక్షుడిగా కే. పవన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 11:12 PM

డ్రగ్స్‌, సైబర్ నేరాలపై ఉక్కుపాదం. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు.మల్కాజిగిరి సీపీ బడుగుల సుమతి.

డ్రగ్స్‌, సైబర్ నేరాలపై ఉక్కుపాదం. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు.మల్కాజిగిరి సీపీ బడుగుల సుమతి.

డ్రగ్స్‌, సైబర్ నేరాలపై ఉక్కుపాదం.  శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు.మల్కాజిగిరి సీపీ బడుగుల సుమతి.
July 28, 2026 08:48 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

'మీ సురక్ష–సహచరి' విస్తరణకు ఆదేశం.. సీసీ కెమెరాలతో నేరాలకు చెక్.

వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించిన మల్కాజిగిరి సీపీ బడుగుల సుమతి.

వనస్థలిపురం స్థానికం ప్రతినిధి :

ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి నేరాన్నీ ఉపేక్షించొద్దని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి స్పష్టం చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, వాటి దర్యాప్తు, సిబ్బంది పనితీరు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సీపీ సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రతి కేసును శాస్త్రీయ ఆధారాలతో విచారించి నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాలకు పాల్పడే వారిపై ఎలాంటి రాజీ లేకుండా ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొంటూ 'మీ సురక్ష', 'సహచరి' యాప్‌లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల సంఖ్యను పెంచి నేరాల నియంత్రణను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు.

అనంతరం ఏసీపీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సందేశమిచ్చారు.

ఈ సమీక్షలో ఎల్‌బీనగర్ డీసీపీ అనురాధ, అదనపు డీసీపీ రామేశ్వర్‌రావు, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, అశోక్‌రెడ్డి, శంకరయ్య, రాజేష్, సంతోష్‌కుమార్, డీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News