Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ అధ్యక్షుడిగా కే. పవన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 10:25 PM

మహిళా వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

మహిళా వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

మహిళా వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం
July 28, 2026 07:45 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి బండి జంగమ్మ

మండల నూతన కమిటీ ఎన్నిక

సమాజంలో రోజురోజుకీ మహిళలపై పెరుగుతున్న వివక్షను అరికట్టేందుకు మహిళలంతా సంఘటితంగా ఉద్యమించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి బండి జంగమ్మ పిలుపునిచ్చారు. మంగళవారం చౌటుప్పల్‌లో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ మండల మొదటి మహాసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..​మహిళల హక్కుల పరిరక్షణ, సమానత్వం, సామాజిక న్యాయ సాధన కోసం సమాఖ్య పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతే సమాజాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. గ్రామస్థాయి నుంచి మహిళా సమాఖ్యను బలోపేతం చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల సాధనకు ముందుకుసాగాలని కోరారు. అనంతరం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ చౌటుప్పల్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

​అధ్యక్షురాలు బద్దుల కలమ్మ,

​ఉపాధ్యక్షురాలు బెదరకోట శివరాణి, ​కార్యదర్శి కడవేరి కౌసల్య, ​సహాయ కార్యదర్శి ఎడెల్లి శశికళ, ​కోశాధికారి ఉడత పార్వతమ్మ,

​కార్యవర్గ సభ్యులు గంగనబోయిన లక్ష్మి, కుంటి ధనమ్మ, కుంటి భాగ్యమ్మ, ఏర్పుల అనూష ను ఎన్నుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News