మహిళా వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం
మహిళా వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం
K.RAVI
ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి బండి జంగమ్మ
మండల నూతన కమిటీ ఎన్నిక
సమాజంలో రోజురోజుకీ మహిళలపై పెరుగుతున్న వివక్షను అరికట్టేందుకు మహిళలంతా సంఘటితంగా ఉద్యమించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి బండి జంగమ్మ పిలుపునిచ్చారు. మంగళవారం చౌటుప్పల్లో నిర్వహించిన ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మండల మొదటి మహాసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..మహిళల హక్కుల పరిరక్షణ, సమానత్వం, సామాజిక న్యాయ సాధన కోసం సమాఖ్య పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతే సమాజాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. గ్రామస్థాయి నుంచి మహిళా సమాఖ్యను బలోపేతం చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల సాధనకు ముందుకుసాగాలని కోరారు. అనంతరం ఎన్ఎఫ్ఐడబ్ల్యూ చౌటుప్పల్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షురాలు బద్దుల కలమ్మ,
ఉపాధ్యక్షురాలు బెదరకోట శివరాణి, కార్యదర్శి కడవేరి కౌసల్య, సహాయ కార్యదర్శి ఎడెల్లి శశికళ, కోశాధికారి ఉడత పార్వతమ్మ,
కార్యవర్గ సభ్యులు గంగనబోయిన లక్ష్మి, కుంటి ధనమ్మ, కుంటి భాగ్యమ్మ, ఏర్పుల అనూష ను ఎన్నుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి