ఆగస్టు 9న రామన్నపేటలో అమరుల యాదిలో బస్సు యాత్ర.. కల్లుగీత కార్మికుల హక్కుల సాధనకు భారీగా తరలిరావాలి: భావడ్ల పెళ్లి బాలరాజు, ఎర్ర రవీందర్.
ఆగస్టు 9న రామన్నపేటలో అమరుల యాదిలో బస్సు యాత్ర.. కల్లుగీత కార్మికుల హక్కుల సాధనకు భారీగా తరలిరావాలి: భావడ్ల పెళ్లి బాలరాజు, ఎర్ర రవీందర్.
Editor Desk
రామన్నపేట
కల్లుగీత కార్మికుల హక్కుల సాధన, వృత్తి పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న "అమరుల యాదిలో" బస్సు యాత్రను ఆగస్టు 9న రామన్నపేటలో జరిగే ప్రదర్శన, సభను విజయవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు భావడ్ల పెళ్లి బాలరాజు, ఎర్ర రవీందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బస్సు యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసి గీత కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో మండల అధ్యక్షుడు కునూరు మల్లేశం, మునుకుంట్ల లెనిన్తో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు.సమావేశంలో మండల అధ్యక్షుడు కునూరు మల్లేశం, మండల కోశాధికారి మునుకుంట్ల లెనిన్, మండల కమిటీ సభ్యులు బైరు రమేష్, బైరు శంకరయ్య, పబ్బు శేఖర్, గంగాధర్, పబ్బు వెంకన్న, గడ్డమీది సత్తయ్య, చెరుకు శ్రీనివాస్, మునుకుంట్ల స్వామి, గడ్డమీది రమేష్, ఉయ్యాల సైదులు, పొతగోని స్వామి, కప్పల రాజయ్య, కప్పల నవీన్, పబ్బు శంకరయ్య, కాటమయ్య శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి