Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల పిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 27, 2026 06:38 PM

యూరియా అధిక వాడకం వద్దు.. పత్తి రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు

యూరియా అధిక వాడకం వద్దు.. పత్తి రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు

యూరియా అధిక వాడకం వద్దు.. పత్తి రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు
July 27, 2026 04:48 PM 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలో నాగూర్ (కే) గ్రామ శివారులో వ్యవసాయ విస్తీర్ణాధికారి సంతోష్ పత్తి పంటను పరిశీలించి రైతులకు పంట సంరక్షణపై అవగాహన కల్పించారు. రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా దోమ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి రైతు పసుపు, నీలం జిగురు అట్టలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. వీటి వినియోగంతో ప్రారంభ దశలోనే పురుగులను నియంత్రించి, పురుగుల మందుల పిచికారీ ఖర్చును తగ్గించుకోవచ్చని తెలిపారు. అలాగే యూరియాను అవసరానికి మించి వాడకూడదని, అధిక యూరియా వల్ల మొక్కలు అతిగా పెరిగి దోమలు, ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. సమతుల్య ఎరువుల వాడకం, జిగురు అట్టల వినియోగంతో పత్తి పంటను ఆరోగ్యంగా కాపాడుకుని మంచి దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News