ప్రజావాణికి 136 వినతులు ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
ప్రజావాణికి 136 వినతులు ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
Editor Desk
రంగారెడ్డి, జూలై 27 ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి వినతిని ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 136 ఫిర్యాదులు అందగా, వాటిలో రెవెన్యూ శాఖకు 54, ఇతర శాఖలకు 82 వినతులు నమోదయ్యాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును ఎప్పటికప్పుడు పరిశీలించి, పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి శారద, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి