ఇంటింటా భగవద్గీత... ధర్మ ప్రచారం సేవలో!
ఇంటింటా భగవద్గీత... ధర్మ ప్రచారం సేవలో!
K.RAVI
ఈ నెల 29న చౌటుప్పల్లో పుస్తక ప్రసాద వితరణ
'పాలకూర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్' చైర్మన్ మురళి గౌడ్
శ్రీ వేద వ్యాస మహర్షి జయంతి (గురు పూర్ణిమ) సందర్భంగా ఈ నెల 29న చౌటుప్పల్ పట్టణంలో విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పాలకూర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ పాలకూర్ల మురళి గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. 'ఇంటింటా శ్రీమద్ భగవద్గీత' పుస్తక ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 4:00 గంటలకు స్థానిక గాంధీ పార్కులో వెయ్యి మంది (సహస్ర) గృహస్థులకు ఉచితంగా భగవద్గీత గ్రంథాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
విజ్ఞానాన్వేషణ పోటీలు... నగదు పారితోషికం
ఈ సందర్భంగా శ్రీమద్భగవద్గీత అంశంపై విద్యార్థులు, సాధకులకు విజ్ఞానాన్వేషణ పోటీలను నిర్వహించి, విజేతలకు నగదు పారితోషకాలను అందజేయనున్నట్లు మురళి గౌడ్ తెలిపారు."హైందవ ధర్మాన్ని ఆచరించే ప్రతి గృహస్థు ఇంట్లో శ్రీమద్ భగవద్గీత ఉండాలి. సమాజంలో ధర్మచింతనను, నైతిక విలువలను పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం."పట్టణ ప్రజలు, ధర్మపరులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి