ఆపదలో అండగా.. మహేష్ కుటుంబానికి రూ.4.10 లక్షల భరోసా.
ఆపదలో అండగా.. మహేష్ కుటుంబానికి రూ.4.10 లక్షల భరోసా.
Editor Desk
భూదాన్ పోచంపల్లి,
కష్టకాలంలో సభ్యుడి కుటుంబానికి అండగా నిలిచి యాదాద్రి భువనగిరి ఫొటో–వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. ఇటీవల మృతి చెందిన రామన్నపేట మండలానికి చెందిన ఫొటోగ్రాఫర్ నకిరేకంటి మహేష్ కుటుంబానికి సంఘం తరఫున రూ.4.10 లక్షల ఆర్థిక సాయం అందజేసింది.
భూదాన్ పోచంపల్లిలో ఆదివారం నిర్వహించిన యాదాద్రి భువనగిరి ఫొటో–వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సాయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్, రాష్ట్ర కమిటీ సభ్యులు మహేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
మహేష్ సంఘం నిర్వహిస్తున్న 'రూ.10 భరోసా', 'రూ.100 భరోసా' సంక్షేమ పథకాల సభ్యుడు కావడంతో నిబంధనల మేరకు రూ.4,10,000 మంజూరు చేసినట్లు సంఘం నాయకులు తెలిపారు.
సభ్యుల కుటుంబాలకు భరోసాగా సంక్షేమ పథకాలు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడుతూ.. సభ్యుల సంక్షేమమే సంఘం ప్రధాన ధ్యేయమని, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడానికే ఈ భరోసా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఫొటోగ్రాఫర్ సంక్షేమ పథకాలలో సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, ఫొటో–వీడియోగ్రాఫర్లు, మహేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి