అక్రమంగా పశువుల రవాణా.. పట్టుకున్న పోలీసులు
అక్రమంగా పశువుల రవాణా.. పట్టుకున్న పోలీసులు
K.RAVI
10 పశువులతో పాటు వాహనం స్వాధీనం
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యాన్ను పోలీసులు శనివారం పట్టుకున్నారు. స్థానిక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పోలీస్ స్టేషన్ పరిధిలోని తూప్రాన్పేట్ రహదారి వద్ద హెచ్సీ నరేష్, కానిస్టేబుల్ శ్రీహరిలు పెట్రో మొబైల్-2 విధుల్లో ఉన్నారు. అనుమానాస్పదంగా వస్తున్న అశోక్ లైలాండ్ మినీ వాహనాన్ని (TG 12 U 4443) తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 10 పశువులు (4 ఆవులు, 6 ఎద్దులు) బయటపడ్డాయి. డ్రైవర్ మొహమ్మద్ అలీ (26) ని విచారించగా, యజమాని మొహమ్మద్ యూసఫ్ (28)తో కలసి వీటిని కోదాడ పశువుల సంతలో కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు అంగీకరించాడు. నిందితులు ఇద్దరూ హైదరాబాద్లోని బహదూర్పురా ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. పశువులను, వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి