Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దండు మల్కాపురంలో ఘనంగా వనమహోత్సవం తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 25, 2026 10:34 PM

అక్రమంగా పశువుల రవాణా.. పట్టుకున్న పోలీసులు

అక్రమంగా పశువుల రవాణా.. పట్టుకున్న పోలీసులు

అక్రమంగా పశువుల రవాణా.. పట్టుకున్న పోలీసులు
July 25, 2026 08:26 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

10 పశువులతో పాటు వాహనం స్వాధీనం

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు శనివారం పట్టుకున్నారు. స్థానిక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పోలీస్ స్టేషన్ పరిధిలోని తూప్రాన్‌పేట్ రహదారి వద్ద హెచ్‌సీ నరేష్, కానిస్టేబుల్ శ్రీహరిలు పెట్రో మొబైల్-2 విధుల్లో ఉన్నారు. అనుమానాస్పదంగా వస్తున్న అశోక్ లైలాండ్ మినీ వాహనాన్ని (TG 12 U 4443) తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 10 పశువులు (4 ఆవులు, 6 ఎద్దులు) బయటపడ్డాయి. డ్రైవర్ మొహమ్మద్ అలీ (26) ని విచారించగా, యజమాని మొహమ్మద్ యూసఫ్ (28)తో కలసి వీటిని కోదాడ పశువుల సంతలో కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అంగీకరించాడు. నిందితులు ఇద్దరూ హైదరాబాద్‌లోని బహదూర్‌పురా ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. పశువులను, వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News