మర్రిగూడ జంక్షన్కు కొత్త ఊపు.. ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
మర్రిగూడ జంక్షన్కు కొత్త ఊపు.. ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
Komidala Mahender reddy
నల్లగొండ: పట్టణంలోని మర్రిగూడ జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ప్రజలకు అంకితం చేసిన ఈ ఫ్లైఓవర్తో నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పట్టణాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో మర్రిగూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గి, వాహనదారులు వేగవంతంగా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి