PRINT TIME: July 24, 2026 06:34 PM
ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి; ఏఓ నాగేశ్వరరావు,సర్పంచ్ సుజాత రాజేందర్
ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి; ఏఓ నాగేశ్వరరావు,సర్పంచ్ సుజాత రాజేందర్
July 24, 2026 04:47 PM
2 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి నియోజకవర్ తిరుమలగిరి మండలం సిద్ధి సముద్రం గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఆరు తడి పంటలపై రైతులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సభావాత్ సుజాత రాజేందర్, ఏవో నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావం
దృష్ట్యా రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగుపైనే ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు. ఎల్ నినో కారణంగా రాబోయే కాలంలో వర్షభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, సకాలంలో వర్షాలు కురవకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయ పద్ధతిలో ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేసి నష్టపోవడం కంటే, ప్రభుత్వ సూచనలు మరియు వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ ఆరుతడి పంటలను సాగు చేయడమే శ్రేయస్కరమని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ భవ్య, రైతు ప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి