రామన్నపేటలో పోలీసుల వెహికల్ చెకింగ్. సీఐ,ఎస్ ఐ ల ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు.
రామన్నపేటలో పోలీసుల వెహికల్ చెకింగ్. సీఐ,ఎస్ ఐ ల ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు.
Editor Desk
రామన్నపేట,
నేరాల నియంత్రణ, రహదారి భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణను పటిష్ఠం చేసే లక్ష్యంతో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో పోలీసులు శుక్రవారం విస్తృత స్థాయిలో ప్రత్యేక వెహికల్ చెకింగ్ నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మోలుగురి రవి ఆధ్వర్యంలో ఎస్ ఐ జి. సతీష్తో పాటు పోలీసు సిబ్బంది ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలను పరిశీలించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని గుర్తించి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వాహనాలను ప్రత్యేకంగా తనిఖీ చేసి వివరాలు నమోదు చేశారు.
సీఐ మోలుగురి రవి మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, నేరాలకు అడ్డుకట్ట వేయడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగంగానే ఈ ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి