సిద్ధి సముద్ర గ్రామాన్ని ఆదర్శవంతగా తీర్చిదిద్దుతా ;సర్పంచ్ సుజాత రాజశేఖర్
సిద్ధి సముద్ర గ్రామాన్ని ఆదర్శవంతగా తీర్చిదిద్దుతా ;సర్పంచ్ సుజాత రాజశేఖర్
Bandi Kiran Kumar
తిరుమలగిరి మండలం సిద్ధి సముద్ర గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని స్థానిక సర్పంచ్ సభవత్ సుజాత రాజశేఖర్ అన్నారు. శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... గతంలో గ్రామాన్ని గత పాలకులు పాలించిన ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అని అన్నారు . గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిలబడి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి గ్రామ ప్రజలు గ్రామానికి ఉన్న మంచినీటి సమస్య , మురికి కాలువలు, సీసీ రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనం, వాటర్ ప్లాంట్ తదితర సమస్యలుతెలిపారు . నన్ను గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలోని ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు నమ్మి సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించారు. మాట ప్రకారమే తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మందుల సామేల్ సహకారంతో గ్రామంలో 20 లక్షల వ్యయంతో సిసి రోడ్లు లింకు రోడ్లునిర్మాణ పనులు చేపట్టమని, ఐదు లక్షల వ్యయo మురికి కాలువల డ్రైనేజీనిర్మాణం పనులు చేపట్టామని, వంటి ఒక్కొక్కటిగా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ గ్రామంలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవడానికి రాకపోకులకు రోడ్లు ,అద్వానంగా మారాయని , నూతనంగా నీటి పైపుల నిర్మాణం చేయించాలని, అదేవిధంగా ఆగిపోయిన నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను చేపట్టాలనిచెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గ్రామంలోని నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. సిద్ధిసముద్ర గ్రామాన్ని తీర్చి దిద్దడానికి రాజకీయాల పార్టీల అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం ఆదర్శవంతంగా తీర్చు దిద్దడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి