జలసిరితో భూగర్భ జలాల సంరక్షణకు గ్రామస్థులు ముందుకు రావాలి
జలసిరితో భూగర్భ జలాల సంరక్షణకు గ్రామస్థులు ముందుకు రావాలి
Komidala Mahender reddy
చిట్యాల, జూలై 25:
భూగర్భ జలాలను పరిరక్షిస్తూ వర్షపు నీటిని ఒడిసిపట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'జలసిరి' పథకాన్ని ప్రతి గ్రామస్థుడు సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల మండల ఏపీవో వనం శ్రీలత పిలుపునిచ్చారు.
చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో సర్పంచ్ సాగర్ల భానుశ్రీ–భిక్షం అధ్యక్షతన స్థానిక వీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన జలసిరి అవగాహన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ పథకం కింద మ్యాజిక్ సోక్ పిట్స్, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, కమ్యూనిటీ సోక్ పిట్స్, కాంపౌండ్ ఊట కుంటలు వంటి నీటి సంరక్షణ పనులను చేపట్టే అవకాశం ఉందని వివరించారు.
పథకం ప్రయోజనాలు పొందాలనుకునే ప్రతి కుటుంబం జాబ్ కార్డు, పట్టాదారు పాస్బుక్, ఇంటి ముందు ఫోటో తీసుకుని గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా సర్పంచ్కు అందజేయాలని సూచించారు.సర్పంచ్ సాగర్ల భానుశ్రీ–భిక్షం మాట్లాడుతూ, గ్రామంలో ఎక్కువ సంఖ్యలో కుంటలు తవ్వించి వర్షపు నీటిని నిల్వ చేసి జలసిరిని ఒడిసిపట్టేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రామస్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అలేందర్ రెడ్డి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, వీవో పాకాల సత్యనారాయణ, అధ్యక్షురాలు జనపాల మమత, బెల్జ అరుణ్, ఉపాధి హామీ మేట్స్ జనపాల మల్లిక, రేణుక, వనజ, రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి