నీట్ వివాదంపై డీవైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఆందోళన
నీట్ వివాదంపై డీవైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఆందోళన
Komidala Mahender reddy
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్.. విద్యాసంస్థల బంద్కు పిలుపు.
చిట్యాల: నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి వడ్డగోని మహేష్, ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్ మాట్లాడుతూ, నీట్ పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేసి పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని కోరారు. గత నాలుగు–ఐదు సంవత్సరాలుగా నీట్ పరీక్షల్లో చోటుచేసుకుంటున్న పేపర్ లీకేజీల కారణంగా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఆ దీక్షకు మద్దతుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ చిట్యాల మండల కార్యదర్శులు జిట్టా సురేష్, జిట్టా దినేష్, ఎల్డీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బడే అజయ్, ఎస్ఎఫ్ఐ నాయకులు జిట్టా హరీష్, గోలి అరుణ్, చంటి, మనోహర్, విన్ను, యశ్వంత్, కార్తీక్, విఘ్నేష్తో పాటు విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి