రామన్నపేట,
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. గ్రామానికి చెందిన 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ తన వ్యవసాయ క్షేత్రంలో వరి నాటు మొక్కలను ' కేటీఆర్' అనే ఆంగ్ల అక్షరాల ఆకారంలో పేర్చి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కేటీఆర్పై తనకున్న అభిమానానికి గుర్తుగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు రమేష్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర కీలకమని పేర్కొంటూ, రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి