విద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నేతలు
విద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నేతలు
Editor Desk
హైదరాబాద్, జూలై 24: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం అమానుషమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల ప్రకారం యాకుత్పురా నియోజకవర్గంలోని సరస్వతి నగర్ డివిజన్లో శుక్రవారం సైలెంట్ ప్రొటెస్ట్ నిర్వహించారు. సిటీకేఫ్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసనకు డివిజన్ అధ్యక్షురాలు నేనావత్ దేవి నాయకత్వం వహించారు. కార్యక్రమానికి యాకుత్పురా కాంగ్రెస్ ఇన్చార్జి కె. రవిరాజు, హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విమర్శించారు. ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై జరిగినట్లు పేర్కొంటున్న దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే కేంద్ర ప్రభుత్వ వైఖరికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం వ్యతిరేకంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి