ఎమ్మెల్యే చొరవ ఫలించింది.. ప్రభుత్వ బడికి పునర్జీవం. లక్ష్మాపురం జడ్పీహెచ్ఎస్ పునఃప్రారంభానికి డీఈఓ గ్రీన్సిగ్నల్.
ఎమ్మెల్యే చొరవ ఫలించింది.. ప్రభుత్వ బడికి పునర్జీవం. లక్ష్మాపురం జడ్పీహెచ్ఎస్ పునఃప్రారంభానికి డీఈఓ గ్రీన్సిగ్నల్.
Editor Desk
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో లక్ష్మాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్) పునఃప్రారంభానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఎమ్మెల్యే సూచనల మేరకు లక్ష్మాపురం, కొత్తగూడెం గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)ను కలిసి పాఠశాల సమస్యలను వివరించగా, పాఠశాల పునఃప్రారంభానికి డీఈఓ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
విద్యార్థుల నమోదు సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయిస్తామని డీఈఓ హామీ ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. ఈ నిర్ణయంతో గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో లక్ష్మాపురం సర్పంచ్ పులిపలుపుల సునీత–వీరస్వామి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కొత్తగూడెం సర్పంచ్ బద్దం యాదమ్మ–యాదగిరి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం వార్డు సభ్యుడు జవ్వాజీ కిషోర్ తన కుమారుడిని ఆరో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని చాటారు.
గ్రామాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నమోదు సంఖ్యను పెంచాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. పాఠశాల అభివృద్ధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ బడిని ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు పూర్తి సహకారం అందిస్తామని గ్రామ ప్రజాప్రతినిధులు ప్రకటించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి