Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే చొరవ ఫలించింది.. ప్రభుత్వ బడికి పునర్జీవం. లక్ష్మాపురం జడ్‌పీహెచ్‌ఎస్ పునఃప్రారంభానికి డీఈఓ గ్రీన్‌సిగ్నల్. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 25, 2026 05:15 PM

ఎమ్మెల్యే చొరవ ఫలించింది.. ప్రభుత్వ బడికి పునర్జీవం. లక్ష్మాపురం జడ్‌పీహెచ్‌ఎస్ పునఃప్రారంభానికి డీఈఓ గ్రీన్‌సిగ్నల్.

ఎమ్మెల్యే చొరవ ఫలించింది.. ప్రభుత్వ బడికి పునర్జీవం. లక్ష్మాపురం జడ్‌పీహెచ్‌ఎస్ పునఃప్రారంభానికి డీఈఓ గ్రీన్‌సిగ్నల్.

ఎమ్మెల్యే చొరవ ఫలించింది.. ప్రభుత్వ బడికి పునర్జీవం.  లక్ష్మాపురం జడ్‌పీహెచ్‌ఎస్ పునఃప్రారంభానికి డీఈఓ గ్రీన్‌సిగ్నల్.
July 25, 2026 03:36 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో లక్ష్మాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్‌పీహెచ్‌ఎస్) పునఃప్రారంభానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఎమ్మెల్యే సూచనల మేరకు లక్ష్మాపురం, కొత్తగూడెం గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)ను కలిసి పాఠశాల సమస్యలను వివరించగా, పాఠశాల పునఃప్రారంభానికి డీఈఓ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

విద్యార్థుల నమోదు సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయిస్తామని డీఈఓ హామీ ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. ఈ నిర్ణయంతో గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో లక్ష్మాపురం సర్పంచ్ పులిపలుపుల సునీత–వీరస్వామి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కొత్తగూడెం సర్పంచ్ బద్దం యాదమ్మ–యాదగిరి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం వార్డు సభ్యుడు జవ్వాజీ కిషోర్ తన కుమారుడిని ఆరో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని చాటారు.

గ్రామాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నమోదు సంఖ్యను పెంచాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. పాఠశాల అభివృద్ధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ బడిని ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు పూర్తి సహకారం అందిస్తామని గ్రామ ప్రజాప్రతినిధులు ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News