ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
K.RAVI
ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా చౌటుప్పల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు బీఆర్ఎస్ నాయకులు ఉచితంగా పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేటీఆర్ నిండు నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలతో, రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ పారిశ్రామికంగా, ఐటీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ప్రజాసేవలో ముందుకు సాగాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గీర్కాటి నిరంజన్ గౌడ్, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి. కౌన్సిలర్లు శేఖర్ గౌడ్, యాదయ్య, ఢిల్లీ మాధవరెడ్డి, పరమేశ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, పర్వతాలు యాదవ్, శ్రీకాంత్, అత్తర్ పాషా, మెట్టు మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి