బోరంచకు ఆరోగ్య వరం.. నూతన పీహెచ్సీ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
బోరంచకు ఆరోగ్య వరం.. నూతన పీహెచ్సీ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బోరంచ గ్రామంలో అత్యాధునిక సౌకర్యాలతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.59 కోట్ల నిధులను మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. పీహెచ్సీ నిర్మాణం పూర్తయితే బోరంచతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు గ్రామంలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డికి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు,అభిమానులు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి