బీఎల్వోలపై సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: నల్లగొండలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన – క్షమాపణ చెప్పాలనిCITU అనుబంధ సంఘం డిమాండ్
బీఎల్వోలపై సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: నల్లగొండలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన – క్షమాపణ చెప్పాలనిCITU అనుబంధ సంఘం డిమాండ్
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
బీఎల్వోలపై సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
నల్లగొండలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన – క్షమాపణ చెప్పాలని సీఐటీయూ అనుబంధ సంఘం డిమాండ్
బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్లు పేర్కొన్న వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నల్లగొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ సెక్రటరీ అవుట రవీందర్ మాట్లాడుతూ, బీఎల్వోలు విధులు నిర్వహించడం లేదని, కూర్చున్నా, నిద్రపోయినా వేతనాలు ఖాతాల్లో పడుతున్నాయని ముఖ్యమంత్రి బహిరంగ సభలో వ్యాఖ్యానించడం బాధాకరమని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో బీఎల్వోలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఓటర్ల జాబితా ప్రక్షాళన వంటి కార్యక్రమాల్లో వారి పాత్రను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
బీఎల్ఏలకు ప్రోత్సాహకరంగా మాట్లాడడం తప్పు కాదని, అయితే అందుకోసం బీఎల్వోలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తికి తగదని వారు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో బీఎల్వోల సేవలను ప్రశంసించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అంగన్వాడీ, ఆశా, ఆర్పీ, వీవోఏ వంటి సిబ్బంది గౌరవ వేతనాలతో పనిచేస్తూనే అదనపు పారితోషికం లేకుండా బీఎల్వో బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారని నాయకులు తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఎలాంటి కష్టపడకుండా వేతనాలు పొందుతున్నారని చెప్పడం తగదని విమర్శించారు.
ముఖ్యమంత్రి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బీఎల్వోలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మిక సంఘాలను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ ప్రాజెక్టు అధ్యక్షురాలు పి. సరిత, వర్కింగ్ ప్రెసిడెంట్కే. సునంద, పాదూరి లక్ష్మి, మణిరూప, యాదమ్మ, జి. కృపావతి, కే. సరోజ, రేణుక, అరుంధతి, అనిత, పల్లవి, విజయకుమారి, జి. పద్మతదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి