గెజిటెడ్ అధ్యాపకుల సంఘం జిల్లా కార్యదర్శిగా డాక్టర్ డి. కిషన్
గెజిటెడ్ అధ్యాపకుల సంఘం జిల్లా కార్యదర్శిగా డాక్టర్ డి. కిషన్
Editor Desk
రామన్నపేట, జూలై 25
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. కిషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ ఎన్నికల్లో ఆయనను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
డాక్టర్ కిషన్ గతంలో జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి, మూడోసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం విశేషం. అధ్యాపకుల సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేసినందుకే సభ్యులు మరోసారి ఆయనపై విశ్వాసం ఉంచినట్లు సహచరులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం డాక్టర్ కిషన్ను అభినందించారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారంలో ఇదే నిబద్ధతతో పనిచేయడంతో పాటు ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి