చట్టాలపై అవగాహనతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి:జడ్జి ఎం. హిమబిందు
చట్టాలపై అవగాహనతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి:జడ్జి ఎం. హిమబిందు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల–పాఠశాల, అలాగే పొట్టిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం న్యాయ అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం. హిమబిందు మాట్లాడుతూ, విద్యార్థులు తమ హక్కులతో పాటు విధుల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమని అన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. బాలల రక్షణ చట్టాలు, మహిళల భద్రత, విద్యార్థుల హక్కులు, ఉచిత న్యాయ సహాయం పొందే మార్గాలపై సులభంగా వివరించారు. చట్టాలపై అవగాహన ఉండటం వల్ల నేరాలకు దూరంగా ఉండటంతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగవచ్చని తెలిపారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవరుచుకుని మంచి పౌరులుగా ఎదగాలని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, సిర్గాపూర్ ఎస్ఐ, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి