Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి; ఏఓ నాగేశ్వరరావు,సర్పంచ్ సుజాత రాజేందర్ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 24, 2026 06:31 PM

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
July 24, 2026 04:47 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండలంలోని దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు స్థానిక ఆందోల్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిసరాల్లో మొక్కలు నాటి, ఐటీ హబ్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ సందర్భంగా యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. నాడు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తే, కేటీఆర్ ఐటీ రంగాన్ని రాష్ట్ర నలుమూలలకూ విస్తరించి లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని కొనియాడారు. మునుగోడు లాంటి ప్రాంతానికి ఐటీ పార్కును తీసుకొచ్చి స్థానిక యువత జీవితాల్లో వెలుగులు నింపిన సమర్థుడైన నాయకుడు కేటీఆర్ అని ప్రశంసించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే మళ్లీ బీఆర్ఎస్ పాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. ​ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మల్కాపురం గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్, నల్పరాజు రమేష్, రమణ గోని రఘు, కృష్ణ, ఏర్పుల రాజేష్, సుర్వి లింగస్వామి గౌడ్, శేఖర్ గౌడ్, యాదగిరి, శంకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News