కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం, తరగతి గదులు, హాస్టల్ వసతులు, పరిశుభ్రతను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి విద్య, భోజనం, వసతి, మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో సమావేశమై కళాశాలలో ఉన్న సమస్యలపై చర్చించి, వాటిని త్వరలోనే పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, విద్యాసంస్థకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి