వీడ్కోలు సభలో సత్యయ్య సేవలను కొనియాడిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
వీడ్కోలు సభలో సత్యయ్య సేవలను కొనియాడిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలంలో మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారిగా విశిష్ట సేవలు అందించి ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పదోన్నతి పొందిన సత్యయ్యకు ఏర్పాటు చేసిన అభినందన, వీడ్కోలు సభలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యయ్యను శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, సత్యయ్య మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో విశేష సేవలు అందించారని, బాధ్యతలను నిష్ఠతో, సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందారని కొనియాడారు. ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పదోన్నతి పొందడం ఆనందదాయకమని పేర్కొంటూ, కొత్త బాధ్యతల్లో మరింత ఉన్నత స్థానానికి చేరుకుని ప్రజాసేవలో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు,ఉపసర్పంచులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి